తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

RCB vs KKR:కేకేఆర్ ను దెబ్బ‌కొట్టిన వ‌ర్షం..ప్లేఆఫ్స్ నుంచి మ‌రో జ‌ట్టు అవుట్

Mahesh Rajamoni | Published : May 17, 2025 11:07 PM

IPL 2025 RCB vs KKR: భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల త‌ర్వాత తాత్కాలికంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 శనివారం తిరిగి ప్రారంభమైంది. అయితే, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) మ‌ధ్య మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు అయింది.   

16
RCB vs KKR:కేకేఆర్ ను దెబ్బ‌కొట్టిన వ‌ర్షం..ప్లేఆఫ్స్ నుంచి మ‌రో జ‌ట్టు అవుట్

IPL 2025 RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)-కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన కీలక మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడకముందే మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు జట్లకు చెరో ఒక పాయింట్ ద‌క్కింది. 

26
RCB vs KKR

భార‌త్-పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల త‌ర్వాత తాత్కాలికంగా వాయిదా ప‌డిన ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కాగా.. ఇప్పుడు తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) త‌ల‌ప‌డ్డాయి. అయితే టాస్ ప‌డ‌కుండానే ఈ మ్యాచ్ వ‌ర్షంతో ర‌ద్దు అయింది. 

36
KKR vs RCB

మ్యాచ్ ర‌ద్దుతో కేకేఆర్ జట్టు ప్లేఆఫ్ రేసు నుండి అవుట్ అయింది. ఇప్పటివరకు 12 పాయింట్లు ఉన్న కోల్‌కతా జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్‌ అవకాశాలను నిలుపుకోగలిగేది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో కోల్‌కతా ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్‌కు అర్హత పొందలేని నాలుగో జట్టుగా నిలిచింది. 

46
RCB vs KKR

కోల్ క‌తా ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్ లు ఆడి కేవ‌లం 12 పాయింట్లు మాత్ర‌మే సాధించింది. మ‌రో వైపు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ 17 పాయింట్ల‌తో టేబుల్ టాపర్ గా కొన‌సాగుతోంది. ఆర్సీబీ 12 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ ల‌ను గెలుచుకుంది. కేకేఆర్ తో మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో ఒక పాయింట్ అందుకుంది. ఆర్సీబీ మ‌రో ఒక్క విజ‌యాన్ని సాధిస్తే ప్లేఆఫ్ బెర్త్ ను అధికారికంగా క‌న్ఫార్మ్ చేసుకుంటుంది. 

56
RCB vs KKR

వ‌ర్షం త‌గ్గితే మ్యాచ్ ను నిర్వ‌హించ‌డానికి అంపైర్లు రాత్రి 10:56 వరకు చూశారు. ఇక‌ కట్ ఆఫ్ టైమ్ గా దాటిన త‌ర్వాత కూడా వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ను ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు చేరో పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ సాగ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశగా స్టేడియాన్ని వీడారు. 

 

66

చిన్నస్వామి వేదికగా ఐపీఎల్ 2025కి తిరిగి ప్రారంభం కావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వర్షం ఈ భారీ మ్యాచ్‌ను దెబ్బతీసింది. అంపైర్లు, ఆర్గనైజర్లు వాతావరణాన్ని పర్యవేక్షిస్తూ మ్యాచ్‌ను కొనసాగించేందుకు కృషి చేసినప్పటికీ, వర్షం ఆగ‌క‌పోవ‌డంతో చివరికి మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.

Read more Photos on
click me!
Recommended Photos