తన ఢిల్లీ టీమ్ మెట్ అయిన పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ రతి నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించారు. ఈ సీజన్లో రెండవ లెవల్ 1 ఉల్లంఘన కావడంతో మ్యాచ్ ఫీజులో 50% జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను ఇచ్చారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం లక్నోలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 9వ ఓవర్ మొదటి బంతికే ముంబై బ్యాటర్ నమన్ ధీర్ను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ తన వివాదాస్పద నోట్బుక్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అతను 24 బంతుల్లో 46 పరుగులు అవుట్ అయ్యాడు. ఇప్పటికే దిగ్వేష్ ను హెచ్చరించిన ఐపీఎల్ మరోసారి అదే పని చేయడంలో మరో డీమెరిట్ పాయింట్, జరిమానాను విధించారు.