ఐపీఎల్ మినీ వేలంలో అతనే హాట్ కేక్... సామ్ కుర్రాన్ కోసం కోట్లు గుమ్మరించబోతున్న ఫ్రాంఛైజీలు...
First Published Nov 21, 2022, 5:05 PM ISTఐపీఎల్ 2023 మినీ వేలం వచ్చే నెలలో జరగనుంది. ఈ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లు కలిపి రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, లూకీ ఫర్గూసన్, కేన్ విలియంసన్, బెన్ స్టోక్స్ వంటి స్టార్లు పాల్గొనబోతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్లేయర్ మాత్రం సామ్ కుర్రాన్...