ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్.. ఐపీఎల్ లో ఆడబోయే ఆటగాళ్లు, ఫ్రాంచైజీల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. రోహిత్ మాట్లాడుతూ.. ‘సిరీస్ ముగిసిన తర్వాత ఇక ప్లేయర్లు వాళ్ల ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. ఇప్పుడు అంతా ఫ్రాంచైజీల ఇష్టం. కీలక ఆటగాళ్ల వర్క్ లోడ్ విషయంలో మేం ఇదివరకే ఫ్రాంచైజీలకు పలు కీలక సూచనలు చేశాం. క్రికెటర్లు కూడా ఏం చిన్న పిల్లలు కాదు. వాళ్లు కూడా ఫిట్నెస్ చూసుకోవాలి. గాయాలు కాకుండా కాపాడుకోవాలి’అని చెప్పాడు.