ఇక నిన్న చెపాక్ లో కేకేఆర్ తో జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో ఫలితం చెన్నైకి అనుకూలంగా రాలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శివమ్ దూబే (48) ఒక్కడే సీఎస్కే తరఫున రాణించాడు. అనంతరం లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ సారథి నితీశ్ రాణా (57 నాటౌట్), రింకూ సింగ్ (54) లు రాణించారు.