శాస్త్రితో పాటు టీమిండియాకు బౌలింగ్ కోచ్ గా ఉన్న భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ లకు కూడా ఐపీఎల్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. గత కొన్నాళ్లుగా రవిశాస్త్రి సారథ్యంలోని భారత శిక్షక బృందం.. ఆటగాళ్లను సానబెడుతున్నది. ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించడం.. విదేశాల్లో టెస్టు సిరీస్ లు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ ఫైనల్ కు చేరడం.. ఇలా ఇవన్నీ శాస్త్రి, అతడి సహాయక బృందం హయాంలో జరిగినవే కావడంతో వారికి డిమాండ్ భారీగా ఉంది.