రాహుల్.. పంజాబ్ తో కొనసాగడానికి ఇష్టపడకపోగా.. రషీద్, సన్ రైజర్స్ తో సాగడానికి ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని లక్నో.. ఈ లీగ్ లో క్రేజ్ ఉన్న ఆటగాళ్లకు ఎర వేస్తున్నదని ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్ లు ఆరోపిస్తున్నాయి. వీరిరువురు ఆ జట్టుతో భారీ డీల్ కుదుర్చుకున్నారని ఆ రెండు ఫ్రాంచైజీలు బీసీసీఐకి మౌఖికంగా ఫిర్యాదు చేశాయి. ఇందులో భాగంగానే రాహుల్ కు రూ. 20 కోట్లు, రషీద్ కు రూ. 16 కోట్లు ఇచ్చేందుకు లక్నో యాజమాన్యం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.