చెన్నైతో ఇటీవలే ముగిసిన మ్యాచులో 88 పరుగులు చేసిన ధావన్.. మొత్తంగా ఆ జట్టుపై 1,029 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇదొక రికార్డు. కాగా.. రోహిత్, ధావన్ లు ఐపీఎల్ లో ఒక జట్టు మీదే వెయ్యి పరుగులు పూర్తి చేయగా.. వార్నర్ మాత్రం పంజాబ్ కింగ్స్ తో పాటు కోల్కతా మీద కూడా ఈ ఫీట్ సాధించి చరిత్ర సృష్టించాడు.