అయితే కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తి నెమ్మదిగా కనుమరుగవుతున్నది. ఒకవేళ ఉన్నా ఎక్కడో కొద్దిచోటే దాని ప్రభావం కనబడుతున్నది. ఈ నేపథ్యంలో ఇక బయో బబుల్స్ కు స్వస్తి చెప్పాలనే డిమాండ్ అన్ని దేశాల క్రికెట్ బోర్డుల నుంచి వినిపిస్తున్నది. బీసీసీఐ కూడా దేశవాళీ క్రికెట్లో బబుల్ లేకుండానే మ్యాచ్ లను నిర్వహించాలని చూస్తున్నది.