ఐపీఎల్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్... 2021 లీగ్‌లో మిగిలిన మ్యాచులకు ఆ రెండు దేశాల క్రికెటర్లు...

First Published Jun 19, 2021, 6:30 PM IST

ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఇది నిజంగా గుడ్‌న్యూస్. కరోనా పాజిటివ కేసుల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌, సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే....

ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు విదేశీ క్రికెటర్లు వస్తారా? అందుబాటులో ఉంటారా? లేదా? అనే విషయంలో అనేక అనుమానాలు రేగాయి.... షెడ్యూల్ కారణంగా న్యూజిలాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ 2021లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండరని తేల్చేశారు...
undefined
ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ 2021 సీజన్‌కి అందుబాటులో ఉంటారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేకపోయింది. అయితే ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆసీస్ సీనియర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి సీనియర్లు, ఐపీఎల్‌లో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారట.
undefined
వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు జరిగే సమయంలో బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్‌లతో కలిసి ఓ ట్రై సిరీస్ నిర్వహించాలని భావించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఈ సిరీస్‌కి దూరంగా ఉండాలని భావిస్తున్న ఆసీస్ సీనియర్ క్రికెటర్లు తెలియచేశారు.
undefined
టీ20 వరల్డ్‌కప్ 2021 జరిగే యూఏఈలోనే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతుండడంతో ఆ లీగ్‌లో పాల్గొనాలని స్మిత్ అండ్ కో భావిస్తున్నారట...
undefined
అలాగే ఐపీఎల్ 2021 సీజన్ సాగే సమయంలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2021) కూడా ఉండడంతో ఆండ్రే రస్సెల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, పోలార్డ్ వంటి వెస్టిండీస్ క్రికెటర్లు అందుబాటులో ఉండడం అనుమానమే అనుకున్నారంతా..
undefined
అయితే ఐపీఎల్ 2021 సీజన్‌తో క్లాష్ అవ్వకుండా ఉండేందుకు, సీపీఎల్ షెడ్యూల్‌ని ముందుకు కదిపింది విండీస్ బోర్డు... వాస్తవానికి ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 19 వరకూ సీపీఎల్ 2021 నిర్వహించాలని భావించారు...
undefined
అయితే సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 సీజన్ పునఃప్రారంభం అవుతుండడంతో వారం రోజుల పాటు కరేబియన్ లీగ్‌ను ముందుకు జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది విండీస్ బోర్డు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే 29 మ్యాచులు ముగిశాయి. మిగిలిన 31 మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. దీంతో విండీస్ ప్లేయర్లతో పాటు ఆసీస్ ప్లేయర్లు కూడా ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడం ఖాయమైపోయింది.
undefined
అయితే ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో ఆసీస్‌తో ట్రై సిరీస్ ఉండడంతో ఆఫ్ఘాన్ ప్లేయర్ల నబీ, రషీద్ ఖాన్ రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. బంగ్లా నుంచి వచ్చే ఇద్దరు ప్లేయర్లు షకీబ్, ముస్తాఫిజుర్‌లను పంపడం కుదరదని బంగ్లా బోర్డు తేల్చేసింది.
undefined
ఇప్పటికే కేన్ విలియంసన్, జానీ బెయిర్ స్టో రావడం లేదని తేలిపోయింది. కెప్టెన్సీ నుంచి తొలగించి, జట్టులో నుంచి కూడా పక్కనబెట్టడంతో డేవిడ్ వార్నర్ రాకపై అనుమానాలు ఉన్నాయి. రషీద్ ఖాన్ కూడా రాకపోతే ఎస్‌ఆర్‌హెచ్‌లో ఫారిన్ స్టార్లు అందరూ ఖాళీ అవుతారు.
undefined
click me!