ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్, అవేశ్ ఖాన్ (డీసీ), హర్షల్ పటేల్ (ఆర్సీబీ), రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే) లు అనూహ్య రీతిలో మెరుస్తున్నారు. మ్యాచ్ మ్యాచ్ కు మెరుగవుతూ అద్భుత ప్రదర్శనలతో అలరిస్తున్నారు. అయితే వీరిలో ఒక శ్రేయస్ అయ్యర్ మాత్రం స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో ఉండటం గమనార్హం. అయితే టీమ్ ఇండియా లోకి ఎంపికైనా ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ లతో పాటు బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.