CSK vs DC: దేవుడా.. మా నాన్నను గెలిపించు ప్లీజ్! కళ తప్పిన సాక్షి ముఖం.. వైరలవుతున్న ధోని కూతురు, భార్య ఫోటోలు

First Published Oct 5, 2021, 12:19 PM IST

IPL 2021: సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings), ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే  (csk) జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోని (Ms Dhoni) కూతురు జీవా (ziva) ధోని.. అతడి భార్య సాక్షి (sakshi) ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఇప్పటికే 3 జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. టేబుల్ టాపర్లుగా ఉన్న సీఎస్కే, ఢిల్లీ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులను అలరించింది. 

ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఇప్పటికే 3 జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. టేబుల్ టాపర్లుగా ఉన్న సీఎస్కే, ఢిల్లీ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులను అలరించింది. 

కాగా ఈ మ్యాచ్ ను ధోని భార్య సాక్షి, కూతురు జీవా స్టాండ్స్ లో కూర్చుని వీక్షించారు. మహీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి కుమార్తె.. తన తండ్రి బాగా ఆడాలని దేవుడికి దండం పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. 

ఈ ఇన్నింగ్స్ లో మహీ.. 27 బంతులాడి 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క ఫోర్ గానీ, సిక్సర్ గానీ లేదు. కాగా, ధోని  ఔటయ్యేటప్పుడు సాక్షి దిగులుగా కనిపించింది. 

ఈ మ్యాచ్ లో జీవాతో పాటు రైనా కుమార్తె గ్రేసియా లు స్టాండ్స్ లో నుంచి ప్రేక్షకులను చూస్తూ ఎంజాయ్ చేశారు. ధోని, రైనా నే గాక వారి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. 

click me!