IPL 2020: 13 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు వీరే...

First Published Sep 29, 2020, 10:11 PM IST

IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహా సమరం మొదలై 13 ఏళ్లు గడిచిపోయింది. ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితులను కూడా విజయవంతంగా టోర్నీని నిర్వహిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటిదాకా ఏ సీజన్ కూడా మిస్ కాకుండా ఆడుతున్న క్రికెటర్లు మాత్రం కొందరే. వాళ్లు ఎవ్వరంటే...

మహేంద్ర సింగ్ ధోనీ: 13 ఏళ్లుగా కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్క ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. సీఎస్‌కే జట్టుకి 11వ సారి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న ధోనీ, మధ్యలో రెండేళ్లు చెన్నై జట్టుపై నిషేధం పడడంతో రైజింగ్ పూణే జట్టుకి నాయకత్వం వహించాడు.
undefined
రోహిత్ శర్మ: రోహిత్ శర్మ హిట్టింగ్‌ను పరిచయం చేసింది ఐపీఎల్. 2008లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకి ఆడిన రోహిత్ శర్మ, 2011 నుంచి ముంబై జట్టుకి ఆడుతున్నాడు. 2013 నుంచి ముంబై జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు రోహిత్ శర్మ.
undefined
విరాట్ కోహ్లీ: 13 ఏళ్లుగా ఒకే ఒక్క జట్టులో కొనసాగుతున్న ప్లేయర్ విరాట్ కోహ్లీ. 2013లో ఆర్‌సీబీ కెప్టెన్ అయిన కోహ్లీ 2016 సీజన్‌లో జట్టును ఫైనల్ చేర్చాడు.
undefined
దినేశ్ కార్తీక్: ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, ఢిల్లీ, పంజాబ్, ముంబై ఇండియన్స్, బెంగళూరు, గుజరాత్ లయన్స్ జట్లకి ఆడాడు. 2018 నుంచి కోల్‌కత్తా జట్టుకి ఆడుతున్నాడు కార్తీక్.
undefined
ఊతప్ప: ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్న రాబిన్ ఊతప్ప, బెంగళూరు, పూణె, కోల్‌కత్తా జట్లకు ఆడాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఐదేళ్లు ఆడిన ఊతప్పను, రాజస్థాన్ రాయల్స్‌కి విక్రయించింది కేకేఆర్.
undefined
శిఖర్ ధావన్: యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడుతున్న శిఖర్ ధావన్, ఐపీఎల్ మొదట్లో ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. ఐదేళ్లు హైదరాబాద్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న ధావన్, గత సీజన్ నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు.
undefined
పియూష్ చావ్లా: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్న పియూష్ చావ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లకి కూడా ఆడాడు.
undefined
ఏబీ డివిల్లియర్స్: ఆర్‌సీబీ జట్టుకు ఆపద్భాంధవుడిగా మారిన ఏబీడీ, మొదటి సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడాడు. 2011 నుంచి తొమ్మొదేళ్లుగా కోహ్లీ టీమ్‌తో కొనసాగుతున్నాడు ఏబీ డివిల్లియర్స్. 13 ఏళ్లుగా ఏ సీజన్ మిస్ కాకుండా ఐపీఎల్ ఆడుతున్న ఒకేఒక్క విదేశీ క్రికెటర్ ఏబీడీ.
undefined
అమిత్ మిశ్రా: ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న మిశ్రా... ఐపీఎల్ మొదట్లో డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకి కూడా ఆడాడు. 159 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు మిశ్రా.
undefined
మనీశ్ పాండే: ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్ మనీశ్ పాండే, కెరీర్ మొదట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాడు. ఆ తర్వాత పూణే వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లకి ఆడి ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నాడు మనీశ్.
undefined
వృద్ధమాన్ సాహా: టెస్టు ప్లేయర్లకి ఐపీఎల్ సెట్ అవ్వదు. కానీ 13 ఏళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు వృద్ధమాన్ సాహా. 2008లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఆడిన సాహా, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకి ఆడాడు. పంజాబ్ ఆడిన ఫైనల్‌లో సెంచరీ చేసిన సాహా, మూడు సీజన్లుగా హైదరాబాద్‌కి ఆడుతున్నాడు.
undefined
పార్థివ్ పటేల్: ప్రస్తుతం బెంగళూరుకి ఆడుతున్న పార్థివ్ పటేల్‌కు మొదటి 3 మ్యాచుల్లో జట్టులో అవకాశం దక్కలేదు. మొదటి సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకి ఆడిన పార్థివ్ పటేల్, 2018 నుంచి బెంగళూరుకి ఆడుతున్నాడు.
undefined
ధవళ్ కుల్‌కర్ణి: భారత జట్టుకి పెద్దగా ఆడలేకపోయినా 13 ఏళ్లుగా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు కుల్‌కర్ణి. మొదటి ఐదు సీజన్లు ముంబై ఇండియన్స్‌కి, ఆ తర్వాత రాజస్థాన్, గుజరాత్ లయన్స్ జట్లకి ఆడిన కుల్‌కర్ణి, మళ్లీ తిరిగి ముంబైకి చేరాడు. అయితే ముంబై ఆడిన మొదటి మూడు మ్యాచుల్లో కుల్‌కర్ణికి అవకాశం దక్కలేదు.
undefined
రైనా, భజ్జీ మిస్: 12 సీజన్లు ఆడిన సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యారు. యూసఫ్ పఠాన్‌ను వేలంలో ఎవ్వరూ కొనుక్కోలేదు. భజ్జీ, రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్‌కు దూరమయ్యారు.
undefined
click me!