రంజీలు, విజయ్ హజారే, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అటాకింగ్ గేమ్ తో ఐపీఎల్ లో అతడు ఆడిన ఆట విశ్లేషకులు, విమర్శకులను సైతం ఆకట్టుకుంది. మరో వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాడిని పెట్టుకుని టీమ్ లో చోటు కల్పించకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తాయి. ఆఖరికి రంజీలలో ట్రిపుల్ సెంచరీ చేస్తే గానీ సెలక్టర్లు అతడిని కరుణించలేదు.