INDvsENG: నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, లంచ్ బ్రేక్ ముందు ఆఖరి బంతికి...
First Published Feb 14, 2021, 11:39 AM ISTటీమిండియా తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులకి ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. లంచ్ బ్రేక్ తీసుకోవడానికి ఆఖరి బంతికి డానియల్ లారెన్స్ అవుట్ కావడం విశేషం. రోరీ బర్న్స్ డకౌట్ కావడంతో మొదటి ఓవర్లోనే సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్, 23 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తొలి టెస్టులో డబుల్ సెంచరీతో అదరగొట్టిన జో రూట్ను మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న అక్షర్ పటేల్ అవుట్ చేశాడు.