జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, తన ప్రస్తుత భారత పేస్ త్రయంపై ప్రశంసల జల్లు కురిపించిన షమీ.. 'ప్రపంచంలోని అత్యుత్తమ పేస్ అటాక్ లలో మనది ఒకటని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. వన్డే వరల్డ్ కప్ సమయంలో మీరు చూశారు. దక్షిణాఫ్రికా సిరీస్ లో రెండో టెస్టులో జస్ప్రీత్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసరడానికి మా పేస్ అటాక్ సరిపోతుందని నేను చెప్పగలను' అని షమీ పేర్కొన్నాడు.