అయితే రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అయ్యర్.. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. కాగా రెండో టెస్టులో కోహ్లీ రానుండటంతో అయ్యర్ ను ఆడిస్తారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకం. అయితే అయ్యర్ కు బదులు.. రహానే గానీ, పుజారాను గానీ తప్పించడం ఖాయమని తెలుస్తున్నది.