సిరీస్ కైవసం చేసుకున్న భారత్
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 304 పరుగులు చేసింది. బెన్ డకెట్ 65 పరుగులతో వారికి బలమైన ఆరంభాన్ని అందించాడు, ఆ తర్వాత జో రూట్ 69 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. చివరికి లియామ్ లివింగ్స్టోన్ (41) ఇన్నింగ్స్ తో జట్టు స్కోరును 304కు చేర్చాడు.
305 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. రోహిత్, గిల్ అదరగొట్టారు. రోహిత్ శర్మ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ లతో భారత్ ఈజీగానే విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ 119 పరుగులు, గిల్ 60 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 పరుగులు చేయడంతో భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో 308 పరుగులు చేసి విక్టరీ అందుకుంది.