Published : Feb 10, 2025, 10:08 AM ISTUpdated : Feb 10, 2025, 10:09 AM IST
Rohit Sharma Fires on Harshit Rana: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాపై కొప్పడ్డాడు. మైండ్ దొబ్బిందా అంటూ హిందీలో హర్షిత్ పై అరిచిన వీడియో వైరల్ గా మారింది.
Rohit Sharma Fires on Harshit Rana: కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్ మరో బంతి మిగిలి ఉండగానే 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ మరో 5 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడుగా శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ లను ఆడారు. దీంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో 308 పరుగులు చేసి విజయం సాధించింది.
25
Image Credit: Getty Images
దిమాక్ లేదా.. హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ అగ్రహం
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. భారత బౌలింగ్ సమయంలో రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలిర్ హర్షిత్ రాణాపై అరవడం కనిపించింది. మైండ్ దొబ్బిందా అంటూ హిందీలో హర్షిత్ పై ఫైర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నింగ్స్ 32వ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది.
35
Rohit Sharma
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మకు ఎందుకు కోపం వచ్చింది?
హర్షిత్ రాణా కారణంగా ఆ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టుకు 4 పరుగులు అదనంగా వచ్చాయి. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా చేసిన పొరపాటుతో ఇంగ్లాండ్ జట్టుకు పరుగులు రావడంతో రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. హర్షిత్ ను చూస్తూ దిమాక్ లేదా.. అంటూ ఫైర్ అయ్యాడు.
32వ ఓవర్లో జోస్ బట్లర్కు హర్షిత్ రాణా బౌలింగ్ వేస్తున్నాడు. ఆ ఓవర్లోని ఐదవ బంతిని బట్లర్ డిఫెండ్ చేశాడు. దీని తర్వాత, హర్షిత్ రాణా బంతిని అందుకుని అనవసరంగా స్టంప్స్పైకి విసిరాడు. రాణా వేసిన ఈ త్రో స్టంప్స్ను తాకకుండా బంతి బౌండరీ వైపు వెళ్లింది. దీంతో ఓవర్ త్రో ద్వారా ఇంగ్లాండ్ కు 4 పరుగులు వచ్చాయి.
45
Harshit Rana-Phil Salt
రోహిత్ శర్మ వీడియో వైరల్
అనవసరంగా ఇంగ్లాండ్ కు హర్షిత్ రాణా త్రో ద్వారా నాలుగు పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. ఈ మిస్టేక్ చేసినందుకు రోహిత్ శర్మ హర్షిత్ రాణాను మందలించాడు. హర్షిత్ చేసిన పనికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అసంతృప్తిగా కనిపించాడు. స్టంప్ మైక్లో రోహిత్ శర్మ 'నీ మెదడు ఎక్కడ ఉంది' అని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత హిట్మ్యాన్ హర్షిత్ను అరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ అరచిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
55
rohit sharma
రోహిత్ సెంచరీ.. వన్డే సిరీస్ భారత్ కైవసం
ఈ మ్యాచ్ కోసం భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్లో రెండు మార్పులు చేసింది. యశస్వి జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో వరుణ్ చక్రవర్తికి అరంగేట్రం చేశాడు.
భారీ టార్గెట్ బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్, గిల్ లు వరుస బౌండరీలతో ఇంగ్లాండ్ పై విరుచుకుపడ్డారు. రోహిత్ తిరిగి ఫామ్ ను అందుకుని సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. 119 పరుగుల తన ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. గిల్ 60 పరుగుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. అక్షర్ పటేల్ 41*, శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులు చేయడంతో భారత్ మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగానే 308 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫిబ్రవరి 12న జరగనుంది.