ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ప్రస్తుతం భారత్, శ్రీలంకలు వేదికలుగా జరుగుతోంది. ఈసారి టాప్ 8 జట్లు రౌండ్-రాబిన్ పద్ధతిలో తలపడుతున్నాయి. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కసారి ఆడుతుంది. ఈ లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి.
• ప్రతి విజయానికి రెండు పాయింట్లు ఉంటాయి.
• టై లేదా రద్దయిన మ్యాచ్లకు ఒక్క పాయింట్.
• పాయింట్లు సమానంగా ఉన్నప్పుడు నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు.
• సెమీస్లో మొదటి జట్టు నాలుగో జట్టుతో, రెండో జట్టు మూడో జట్టుతో తలపడుతుంది.
అంటే భారీ తేడాతో గెలుపులు సాధించడం, మెరుగైన NRR ఉంచుకోవడం సెమీఫైనల్ టికెట్కు కీలకం.