2019లో ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్టులోనే కోహ్లి సెంచరీ చేశాడు. ఇక రేపు లంకతో జరుగబోయేది కూడా పింక్ బాల్ టెస్టే. దీంతో కోహ్లి అభిమానులు.. ఈ టెస్టులో అతడు సెంచరీ చేస్తాడని అంచనాలు వేసుకుంటున్నారు. మరి అశేషాభిమానుల కోరికను కోహ్లి మన్నిస్తాడా..? అంటే మరికొన్నిగంటలు వేచి చూడాల్సిందే.