India vs Pakistan Asia Cup: భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్కు సమయం ఆసన్నమవుతోంది. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్పై అందరి దృష్టి పడింది.
భారత్–పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ సమీపిస్తున్న వేళ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి కొత్త వ్యూహం రూపొందించారు. ఈ ప్లాన్లో ముఖ్యమైన అస్త్రం అర్షదీప్ సింగ్ అని తెలుస్తోంది.
25
ఆసియా కప్లో భారత జట్టుకు విజయవంతమైన ఆరంభం
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత్, యూఏఈపై ఘన విజయం సాధించింది. మొదట యూఏఈ జట్టును కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసి, 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ మంచి ఆత్మవిశ్వాసంతో పాక్ మ్యాచ్కి సిద్ధమవుతోంది.
35
సెప్టెంబర్ 14న భారత్–పాక్ పోరు
ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్లు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ, భిన్న వ్యూహాలతో మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.
పాకిస్తాన్ బ్యాట్స్మెన్ను ఒత్తిడిలోకి నెట్టడానికి, అర్షదీప్ సింగ్ను ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో అర్షదీప్ దూకుడుగా బౌలింగ్ చేయగలడు. 2024 టీ20 వరల్డ్కప్లో భారత్ తరఫున అతనే ఎక్కువ వికెట్లు తీశాడు.
55
భారత ఆశలు అర్షదీప్పై
పాకిస్తాన్ టాప్ ఆర్డర్ను తొందరగా పెవిలియన్కి పంపడం లక్ష్యంగా అర్షదీప్ను ఉపయోగించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సూపర్–4 దశలోకి చేరుతుంది కాబట్టి, అర్షదీప్ ప్రదర్శనపై అభిమానులతో పాటు జట్టుకు కూడా భారీగా ఆశలు ఉన్నాయి.