కాన్పూర్ టెస్టులో మంచు కారణంగా లో క్వాలిటీ కెమెరాలో తీసినట్టు, టీవీల్లో మ్యాచ్ ప్రసారమైంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వర్షం పడుతున్నప్పుడు కూడా స్పష్టంగా, హెచ్డీ క్వాలిటీతో మ్యాచ్ ప్రసారం జరిగింది...
అదీకాకుండా ముంబై టెస్టు ప్రారంభానికి ముందు కొన్ని గంటల ముందే వర్షం ఆగిపోయినా, పిచ్ చిత్తడిగా మారడంతో దాదాపు మూడు గంటల పాటు మ్యాచ్ను నిలిపివేయాల్సి వచ్చింది...
మెల్బోర్న్, సిడ్నీ వంటి నగరాల్లో వర్షం ఆగిన క్షణాల్లో పిచ్ను మ్యాచ్ ఆడేందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నప్పుడు ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ, స్టేడియాల నిర్వహణలో ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది..
తాజాగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు, మూడో రోజు ఆటకు స్పైడర్ కెమెరా కారణంగా అంతరాయం కలిగింది...
ఫీల్డ్లో ప్లేయర్ల కదళికలను దగ్గరి నుంచి కెమెరాల్లో బంధించేందుకు అనుగుణంగా వైడ్ల ద్వారా అమర్చిన స్పైడర్ క్యామ్, అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది...
అయితే ఇండియా రెండో ఇన్నింగ్స్ని డిక్లేర్ చేసి, న్యూజిలాండ్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన తర్వాత స్పైడర్ క్యాచ్ క్రీజు మధ్యలో ఆగిపోయింది...
అశ్విన్ బౌలింగ్ వేసేందుకు సిద్ధమవుతున్నా, స్పైడర్ క్యామ్ పైకి వెళ్లకపోవడంతో టెక్నికల్ లోపం వచ్చిందని గ్రహించిన అంపైర్లు, షెడ్యూల్ టైం కంటే ముందుగానే టీ విరామం తీసుకోవాల్సి వచ్చింది...
ఫీల్డ్ మధ్యలో ఆగిన స్పైడర్ క్యామ్ ముందుకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... ‘నీకు ఇక్కడేం పని, పైకి వెళ్లు...’ అని సైగలతో సూచించడం, సూర్యకుమార్ యాదవ్ వచ్చి చెక్ చేయడం ఈ కెమెరాలో రికార్డైంది.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.