IND vs BAN : అభిషేక్ శర్మ రనౌటా? నాటౌటా? అసలు ఏం జరిగింది?

Published : Sep 24, 2025, 09:57 PM IST

India vs Bangladesh: ఆసియా కప్ 2025 సూపర్ 4 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అయితే, సెంచరీ పక్కా చేస్తాడనుకున్న సమయంలో వివాదాస్పద రనౌట్ అయ్యాడు.

PREV
14
India vs Bangladesh: ఇండియా vs బంగ్లాదేశ్.. ఆసియా కప్ 2025 బిగ్ ఫైట్

ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగింది.

బంగ్లాదేశ్ జట్టుకు జాకర్ అలీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ బెర్త్ దాదాపుగా ఖాయం అవుతుంది. ఈ మ్యాచ్ లో భారత్ కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ లు సూపర్ బ్యాటింగ్ తో బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టారు.

24
అభిషేక్ శర్మ వివాదాస్పద రనౌట్.. బాల్ ముందు వికెట్లను తాకిందా?

ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ లు అద్భుతమైన ఆరంభం అదించారు. ధనాధన్ బ్యాటింగ్ బంగ్లా బౌలింగ్ ను దంచికొట్టారు. అభిషేక్ శర్మ మరోసారి సునామీ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు. మొత్తంగా అద్భుతమైన షాట్స్ కొడుతూ 37 బంతుల్లో 75 పరుగుల నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.

సెంచరీ పక్కా అనిపించేలా అభిషేక్ శర్మ దూకుడు బ్యాటింగ్ కొనసాగింది. కానీ, అనూహ్యంగా 75 పరుగుల వద్ద 12 ఓవర్ లో రనౌట్ అయ్యాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సింగిల్ కోసం ముందుకు వచ్చి తర్వాత ఆగాడు. అప్పటికే సగం దూరం వచ్చిన అభిషేక్ మళ్లీ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు పరుగెత్తాడు. రిషాద్ అద్భుతమైన త్రో తో రనౌటయ్యాడు. 

అయితే, ఈ రనౌట్ క్లియర్ గా కనిపించకపోవడంతో థర్డ్ ఎంపైర్ చెక్ చేశారు. బాల్ కంటే ముందు ముస్తఫిజుర్ చేతి వికెట్లను తాకినట్టు కనిపించింది. మరో యాంగిల్ లో చెక్ చేయగా, బాల్ తగిలినట్టు కనిపించింది. కానీ, అది క్లియర్ గా లేదు. థర్డ్ అంపైర్ రనౌట్ గా ప్రకటించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

34
బ్యాటింగ్ లో తడబడిన భారత్

ఈ మ్యాచ్ లో ఓపెనర్లు మంచి ఆరంభం అందించిన ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 169 పరుగుల టార్గెట్ ను ఉంచింది. భారత ప్లేయర్లలో అభిషేక్ శర్మ 75 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 38 పరుగులు, శుభ్ మన్ గిల్ 29 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సెన్ 2 వికెట్లు తీసుకున్నారు.

44
టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున ఫాస్టెస్ హాఫ్ సెంచరీలు

అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. భారత్ తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో 25 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డుల్లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన ఇప్పటివరకు 7 సార్లు ఈ ఘనత సాధించాడు.

సూర్యకు తర్వాత రోహిత్ శర్మ 6 సార్లు ఈ రికార్డు సాధించాడు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇప్పటికే 5 సార్లు 25 బంతుల్లోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసి మూడో స్థానంలో ఉన్నాడు. దాని తరువాత యువరాజ్ సింగ్ 4 సార్లు, కెఎల్ రాహుల్ 3 సార్లు ఈ జాబితాలో ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories