వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ తర్వాత కుల్దీప్ యాదవ్, భారత జట్టుతోనే ట్రావెల్ చేసినా ఆడిన మ్యాచులు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన కుల్దీప్ యాదవ్, ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. మూడో టెస్టు సమయంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా గాయపడి టీమ్కి దూరమైనా కుల్దీప్కి అవకాశం దక్కలేదు...