భారత్ తరఫున మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత కొత్త బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్కు ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఐపీఎల్ లో తుఫాను బౌలింగ్ చేసిన మయాంక్ పై మొదటి నుంచి అందరి చూపు ఉంది. అతనితో పాటు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో నితీశ్ ఆకట్టుకున్నాడు. శివమ్ దూబే గాయపడటంతో అతనికి చోటు దక్కింది. తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, జితేష్ శర్మలకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కలేదు.
టీమిండియా ప్లేయింగ్-11 : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్-11 : లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహీద్ హృదయ్, మహ్మదుల్లా, జెకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.