మంధాన మిడిల్ ఆర్డర్కు బలమైన పునాది వేయగా, ఆ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 34), హర్లీన్ డియోల్ (50 బంతుల్లో 44), రిచా ఘోష్ (12 బంతుల్లో 26), జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ లలో టీమిండియా స్కోరు 300 పరుగులు దాటింది. 91 పరుగుల ఇన్నింగ్స్ తో ఆడిన మంధన ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును బద్దలు కొట్టింది.