IND vs SA: కేప్‌టౌన్‌ టెస్ట్‌కు టీమిండియాలో కీల‌క మార్పులు.. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఔట్ !

Published : Jan 01, 2024, 01:34 PM IST

IND vs SA, Cape Town Test: ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి మ్యాచ్ లో భార‌త్ ఘోరంగా ఇన్నింగ్స్ 32 ప‌రుగుల తేడాతో ఓడింది. ఈ క్రమంలోనే కేప్‌టౌన్‌లో జ‌ర‌గ‌బోయే రెండో టెస్టుకు ముందు భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు జ‌రిగాయి.   

PREV
16
IND vs SA: కేప్‌టౌన్‌ టెస్ట్‌కు టీమిండియాలో కీల‌క మార్పులు.. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఔట్ !
Jadeja

IND vs SA, 2nd Test: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి టెస్టును భారత జట్టు జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆడనుంది. తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న జ‌ట్టు కీల‌క మార్పులు జ‌రిగే అవ‌కాశ‌ముంది.

26
Indian Team

దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న భారత జట్టు ఆరంభం చాలా దారుణంగా సాగింది. సెంచూరియన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జనవరి 3 నుంచి జరిగే రెండో మ్యాచ్ లో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుందని దాదాపు ఖాయమైంది.

36

ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టులో ఆడటం దాదాపు ఖాయమైంది. తొలి మ్యాచ్ లో వెన్నునొప్పి కారణంగా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, అతను ఇప్పుడు ఫిట్ గా ఉన్నాడ‌నీ, కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జ‌ర‌గ‌బోయే రెండో టెస్టుకు తిరిగి జ‌ట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత‌కుముందు, తొలి మ్యాచ్ లో జడేజా స్థానంలో అశ్విన్ కు ఆడే ఛాన్స్ ద‌క్కింది.
 

46
Ravichandran Ashwin

సెంచూరియన్ వేదికగా అరంగేట్ర టెస్టు ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకోలేకపోయాడు. తొలి టెస్టులో కృష్ణ 20 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చి ఒక బ్యాట్స్ మన్ ను ఔట్ చేశాడు. దీంతో అత‌ని స్థానంలో అవేశ్ ఖాన్ లేదా ముఖేష్ కుమార్ లలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. మహ్మద్ షమీ స్థానంలో అవేశ్ ఖాన్ ను ఇటీవల జట్టులోకి తీసుకున్నారు.
 

56
Mukesh Kumar

కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాను ఓడించడం భారత్ కు పెద్ద సవాల్ కానుంది. ఎందుకంటే కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత జట్టు ఇప్పటి వరకు విజయం సాధించలేదు. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య మొత్తం 6 టెస్టు మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆతిథ్య జట్టు 4 మ్యాచ్ ల‌లో విజయం సాధించింది. అదే సమయంలో రెండు మ్యాచ్లు డ్రా అయ్యాయి. గత పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఈ మైదానంలో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
 

66
Prasidh Krishna

భారత టెస్ట్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.
 

Read more Photos on
click me!

Recommended Stories