అబుదాబి షేఖ్ జాయెద్ స్టేడియంలో ఆసియా కప్ 2025లో గ్రూప్ దశ చివరి మ్యాచ్లో భారత్, ఒమన్కు 189 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఒమన్ అద్భుతమైన ఆటతో భారత్ కు గట్టిపోటీ ఇచ్చింది. అయితే, విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత్ ను దాదాపు ఓడించేంత పనిచేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. జట్టు మొదటి వికెట్ 6 పరుగుల వద్దే కోల్పోయింది. శుభ్మన్ గిల్ తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.
తర్వాత అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రెండో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. భారత్ 72 పరుగులతో వుండగా అభిషేక్ ఔటయ్యాడు. అతను 15 బంతుల్లో 2 సిక్స్లు, 5 ఫోర్లతో 38 పరుగుల నాక్ ఆడాడు.