భారత్ 600-650 పరుగులు చేస్తే గెలిచే ఛాన్స్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఇప్పటికే ఔట్ అయ్యారు. నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కు దిగనున్నాడు. వీరితో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లు బ్యాటింగ్లో రాణించి భారీ స్కోరు చేస్తే భారత్ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ఈ బ్యాట్స్మెన్ ధైర్యంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. టీమిండియా రెండవ ఇన్నింగ్స్లో 600-650 పరుగుల స్కోరును చేస్తే భారత్ మెరుగైన స్థతిలో ఉంటుంది. అంటే దీని కారణంగా న్యూజిలాండ్ ముందు నాల్గవ ఇన్నింగ్స్లో 250-300 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచవచ్చు. ఇదే జరిగితే భారత్ మ్యాచ్లో విజయం సాధించడం అంత కష్టమైన విషయమేమీ కాదు.