భారత్ ముందు భారీ టార్గెట్ ఉంచిన ఇంగ్లాండ్
కటక్లోని బారాబతి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. బెన్ డకెట్, జో రూట్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్లకు తోడుగా చివరలో లివింగ్ స్టోన్ మంచి ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.
భారత్ తరఫున రవీంద్ర జడేజా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ కు ఓపెనర్లు అదరిపోయే ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ సెంచరీ, గిల్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లతో భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసి ఇంగ్లాండ్ పై విజయాన్ని అందుకుంది.
Rohit Sharma: కటక్లో హిట్మ్యాన్ గర్జన.. 32వ సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ