India vs England: జూన్, జూలై నెలల్లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి 5 టెస్ట్ల సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే జట్టు బయలుదేరుతుంది. మీడియా కథనాల ప్రకారం, రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తారు. మొదటి టెస్ట్ జూన్ 20న ప్రారంభమై, చివరి మ్యాచ్ జూలై 31న ముగుస్తుంది.