ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్
భారత ప్లేయర్లలో విరాట్ కోహ్లీ 84, శ్రేయాస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42* పరుగులు, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. భారత జట్టు 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 267 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లలో ఎలిస్ 2, ఆడం జంపా 2 వికెట్లు తీసుకున్నారు.
ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు అర్హత సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో రెండవ మ్యాచ్ మార్చి 5న న్యూజిలాండ్ - దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో భారత్ తో టైటిల్ కోసం పోటీ పడుతుంది.