IND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

Published : Mar 04, 2025, 10:01 PM IST

India vs Australia: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.

PREV
14
IND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్

IND vs AUS Champions Trophy Semi Final Live: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ స్పెషల్ నాక్ లతో భారత జట్టు విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు సూపర్ విక్టరీ అందుకుంది. ఐదో సారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. కేెల్ రాహుల్ సిక్సర్ తో భారత్ కు విజయాన్ని అందించాడు.

24
Virat Kohli vs Australia

టాస్ గెలిచిన కంగారూ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భార‌త బౌల‌ర్లు రాణించ‌డంతో ఆసీస్ 264 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఆరంభంలో ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడాడు. అయితే, అతన్ని వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్ తో అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ స్లో అయింది. మధ్యలో స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలు మంచి నాక్ లు ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 200 పరుగుల మార్కును అందుకుంది. అయితే, భారత బౌలర్లు రాణించడంతో వికెట్లు పడటం ఆగలేదు. దీంతో భారత్ 264 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ 39, స్టీవ్ స్మిత్ 73, అలెక్స్ క్యారీ 61, మార్నస్ లబుషేన్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నారు. 

34
Image Credit: Getty Images

265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మంచి శుభారంభం లభించలేదు. 20 పరుగుల వద్ద గిల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత 50 పరుగుల లోపే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. అయితే, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అద్బుతమైన ఆటతో టీమిండియాను విజయం వైపు నడిపించారు. చివరలో కేెల్ రాహుల్, హర్దిక్ పాండ్యాలు మంచి ఇన్నింగ్స్ లతో భారత్ విజయాన్ని అందుకుంది.

44
Image Credit: Getty Images

కేఎల్ రాహుల్ సిక్సర్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 4 వికెట్ల తేడాతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ విక్టరీ అందుకుంది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 84 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు, కేఎల్ రాహుల్ 42* ప‌రుగులు, హార్దిక్ పాండ్యా 28 ప‌రుగులు చేశారు. భార‌త జ‌ట్టు 48.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 267 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో ఎలిస్ 2, ఆడం జంపా 2 వికెట్లు తీసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories