INDvsAUS: కోహ్లీ హాఫ్ సెంచరీ... హార్ధిక్ పాండ్యా, జడేజా మెరుపులు... ఆస్ట్రేలియా ముందు మంచి టార్గెట్...
First Published Dec 2, 2020, 12:40 PM ISTINDvAUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ప్రత్యర్థికి భారీ టార్గెట్ ఇవ్వలేకపోయింది. ఆసీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు విరాట్ కోహ్లీ మినహా భారత టాపార్డర్ ఫెయిల్ కావడంతో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అయితే హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడి ఆరో వికెట్కి భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో 374, 389 వంటి భారీ స్కోర్లు చేసిన ఆస్ట్రేలియాకి ఇది ఈజీ టార్గెట్ అవుతుందనే అంచనా వేస్తున్నారు అభిమానులు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్తో పాటు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా.