INDvsAUS: మా మనీశ్ అన్నని ఆడించి ఉంటేనా... కోహ్లీ తీరుపై నెటిజన్ల ఆగ్రహం..

First Published Dec 2, 2020, 12:00 PM IST

ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమిండియాకి ఏదీ కలిసి రావడం లేదు. మొదటి రెండు వన్డేల్లో టాస్ ఓడి, ప్రత్యర్థికి భారీ స్కోరు అప్పగించిన టీమిండియా, చేధనలో పోరాడి 300+ స్కోరు చేసింది. మూడో వన్డేలో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంటే... టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ కావడంతో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేలా ఉంది. దీంతో టీమిండియా లక్కీ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేకి అవకాశం ఇవ్వాలని అంటున్నారు అభిమానులు.

గత రెండేళ్లుగా టీమిండియాకు ఎంపికవుతూనే ఉన్నాడు మనీశ్ పాండే. అయితే తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు...
undefined
ప్రస్తుత వన్డే సిరీస్‌కి కూడా ఎంపికైన మనీశ్ పాండే... మూడో వన్డేల్లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు... దీంతో టీమిండియా తీరుపై సెటైర్లు వినిపిస్తున్నాయి.
undefined
2016లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే... రోహిత్, ధావన్, కోహ్లీ వంటి టాప్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఆదుకున్నాడు. అజేయ సెంచరీతో చెలరేగి టీమిండియాను వైట్ వాష్ నుంచి కాపాడాడు.
undefined
అలాంటి మనీశ్ పాండేని కేవలం డగౌట్‌లో కూర్చొని మ్యాచ్ చూసేందుకే టీమిండియాకి ఎంపిక చేస్తున్నట్టుగా ఉందని కొందరు అంటుంటే... జట్టులో ఆడించకపోతే సెలక్ట్ చేయడం ఎందుకని విమర్శిస్తున్నారు.
undefined
మనీశ్ పాండే స్థానంలో అంబటి రాయుడు లేదా సూర్యకుమార్ యాదవ్ ఉండి ఉంటే... ఇలా ఎంపిక చేసి, రిజర్వు బెంచ్‌కే పరిమితం చేస్తుందన్నందుకు ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసేవారని అంటున్నారు మరికొందరు...
undefined
రెండేళ్లుగా భారత జట్టుకు ఎంపికవుతూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న మనీశ్ పాండే... అత్యధిక మ్యాచులు రిజర్వు బెంచ్‌కే పరిమితమైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసి ఉంటాడని అంటున్నారు.
undefined
రెండు మ్యాచుల్లో విఫలమైన శిఖర్ ధావన్ కంటే, మూడు మ్యాచుల్లో పెద్దగా రాణించని శ్రేయాస్ అయ్యర్ కంటే.. కీలక సమయంలో పెవిలియన్ చేరే కెఎల్ రాహుల్ కంటే మనీశ్ పాండే మెరుగ్గా రాణించేవాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అతని అభిమానులు...
undefined
ఐపీఎల్‌లో రాణించడం వల్లే శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీమిండియాలో చోటు దక్కించుకుంటే, భారత జట్టు తరుపున అద్భుతంగా ఆడి కూడా మనీశ్ పాండే బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
తుది జట్టులో తనకి చోటు దక్కుతుందనే ఆశాభావంతో నిన్న నెట్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడట మనీశ్ పాండే. అయితే ఆఖరి నిమిషంలో అయ్యర్‌కే అవకాశం ఇచ్చిన కోహ్లీ, మనీశ్‌కి మొండిచెయి చూపించాడు.
undefined
గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిపడిన హార్ధిక్ పాండ్యాకి విశ్రాంతినిచ్చి మనీశ్ పాండేని ఆడించాల్సిందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అయితే మరోసారి మనీశ్ పాండే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే సిరీస్‌ను ముగించాడు.
undefined
click me!