పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు ఆస్ట్రేలియాదే పైచేయి... విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా..
First Published Dec 17, 2020, 5:16 PM ISTఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 89 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, రెండో బంతికే పృథ్వీషా వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించగా వైస్ కెప్టెన్ అజింక రహానే, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పూజారా రాణించారు. మొదటి రోజే 6 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్లో పైచేయి సాధించింది.