విరాట్ కోహ్లీ రనౌట్, ఆ వెంటనే రహానే, విహారి... ఎనిమిదేళ్ల తర్వాత కోహ్లీని అలా అవుట్ చేసిన రహానే...
First Published Dec 17, 2020, 4:48 PM ISTఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేసి, రనౌట్ అయ్యాడు... 180 బంతుల్లో 8 ఫోర్లతో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... అజింక రహానే ఇచ్చిన రాంగ్ కాల్ కారణంగా అనవసర పరుగుకి ప్రయత్నించి... పెవిలియన్ చేరాడు. 188 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా... ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి...