అయితే అక్టోబర్ లో జరుగనున్న ఈ మెగా టోర్నీ కంటే ముందే భారత్ లో మార్చి నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2023 సీజన్ కూడా జరగాల్సి ఉంది. రెండు నెలల పాటు సాగే ఈ సీజన్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు దాదాపు అందరూ పాల్గొననున్నారు. సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లు బుమ్రా, షమీ, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా తమ ఫ్రాంచైజీల తరఫున ఆడనున్నారు.