టీ20 ప్రపంచకప్లో ఈనెల 23న మెల్బోర్న్ వేదికగా జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడి గండం ఉందన్న దానికంటే గత మూడు రోజులుగా ఇరు జట్ల బోర్డులు, మాజీ క్రికెటర్లు చేసుకుంటున్న వ్యాఖ్యలతో అసలు ఆదివారం మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానం తలెత్తుతున్నది.