టీమిండియాను చిత్తుచేసిన న్యూజిలాండ్
161 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలి వర్మ కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరువద్దే వికెట్ సమర్పించుకుంది. దీంతో 11 పరుగుల వద్దే టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. ఇలా మొదలైన వికెట్ల పతనం కొనసాగడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.
స్మృతి మందాన 12, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 15, జెమిమా 13, రిచా ఘోష్ 12, దీప్తి శర్మ 13, అరుంధతి రెడ్డి 1, ఫూజా వస్త్రకర్ 8, శ్రేయాంక పాటిల్ 7, ఆశ శోభన 6(నాటౌట్), రేణుకా ఠాకుర్ 0 పరుగులు చేసారు. ఇలా టీమిండియా19 ఓవర్లలో కేవలం 102 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
కివీస్ బౌలర్లలో రోస్ మేరీ 4 ఓవర్లేసి 4 వికెట్లు పడగొట్టి భారత జట్టు నడ్డి విరిచింది. ఇక లియా తహుహు 3, ఇడెన్ కార్సన్ 2, అమెలియా 1 వికెట్ పడగొట్టారు.