టీ20 ప్రపంచకప్ తుది అంకానికి వేళైంది. ఆదివారం అర్ధరాత్రి కొత్త ప్రపంచ ఛాంపియన్ అవతరించబోతున్నది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగనున్న ఈ పోరులో విజేత ఎవరనేది టాస్ తోనే తేలిపోతుందని విశ్లేషకుల మాట. అయితే ఈ టోర్నీలో.. గ్రూప్ దశలో భారత్ ను చిత్తుగా ఓడించి.. ఆ తర్వాత టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకట్ట వేసిన జట్టుకే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం.