విరాట్ కోహ్లి.. తమపట్ల దురుసుగా ప్రవర్తించాడని టీమిండియాకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారని, లేఖలో అందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారని ఆ వార్త సారాంశం. అయితే ఈ లేఖ రాసినవారిలో.. పుజారా, అశ్విన్ పేర్లే వినిపించాయి. తర్వాత బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇలాంటిదేమీ లేదని కొట్టిపారేసాడు.