ఇదిలాఉండగా.. భారీ అంచనాలతో టోర్నీ ప్రారంభించిన టీమిండియా పాకిస్థాన్ పై దారుణ పరాభావాన్ని మూటగట్టకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్ లో పాక్ పై ఇప్పటివరకు ఓడని రికార్డున్న భారత్.. ఇటీవల జరిగిన మ్యాచ్ లో చిత్తుచిత్తుగా ఓడింది. పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత న్యూజిలాండ్ పై పోరులోనూ ఓడి.. సెమీస్ కు చేరకుండానే ఇండియాకు పయనమైంది.