ప్రస్తుతం సీఎస్కేలో సారథి ఎంఎస్ ధోనినే వికెట్ కీపింగ్ బాధ్యతలు చూస్తున్నాడు. వచ్చే సీజన్ లో ధోని ఆటగాడిగా ఉంటాడో లేక మెంటార్ గా ఉంటడోననే విషయంపై ఇంకా సందిగ్దం వీడలేదు. అయితే ధోని ప్లేస్ ఖాళీ అయితే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శాంసన్ చూస్తున్నాడు. 2022 లో సీఎస్కేకు కెప్టెన్ గా ఎవరున్నా తనకు మాత్రం వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటర్ గా సుస్థిరస్థానం సంపాదించుకోవాలనేది శాంసన్ ప్లాన్. మరి ఈ ప్లాన్ ఏ మేరకు విజయవంతమవుతుందో చూడాలంటే జనవరిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం దాకా వేచి చూడాల్సిందే.