టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ వేదిక మార్పు!... లార్డ్స్‌ నుంచి తరలించడానికి ఐసీసీ యత్నం...

Published : Mar 07, 2021, 03:33 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ రేసు నుంచి ఇంగ్లాండ్ తప్పుకున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టు గెలిచిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లిన ఇంగ్లాండ్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఇంగ్లాండ్‌లో ఫైనల్ నిర్వహించడంపై అనుమానాలు రేగుతున్నాయి.

PREV
18
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ వేదిక మార్పు!... లార్డ్స్‌ నుంచి తరలించడానికి ఐసీసీ యత్నం...

షెడ్యూల్ ప్రకారం ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ మైదానంలో జూన్ 18 నుంచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే ఈ ఫైనల్ ఫైట్‌లో న్యూజిలాండ్, ఇండియా తలబడుతుండడంతో ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లాండ్ సముఖంగా లేనట్టు టాక్...

షెడ్యూల్ ప్రకారం ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ మైదానంలో జూన్ 18 నుంచి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే ఈ ఫైనల్ ఫైట్‌లో న్యూజిలాండ్, ఇండియా తలబడుతుండడంతో ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లాండ్ సముఖంగా లేనట్టు టాక్...

28

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఓ ఐసీసీ ఫైనల్‌కి ఆతిథ్యం ఇవ్వడం అంత తేలికైన పని కాదు. మ్యాచ్‌కి దాదాపు 10 రోజుల ముందుగానే బయో బుబల్  జోన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఓ ఐసీసీ ఫైనల్‌కి ఆతిథ్యం ఇవ్వడం అంత తేలికైన పని కాదు. మ్యాచ్‌కి దాదాపు 10 రోజుల ముందుగానే బయో బుబల్  జోన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

38

కరోనా పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలతో పాటు సెక్యూలర్ జోన్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది...

కరోనా పరీక్షలు, క్వారంటైన్ నిబంధనలతో పాటు సెక్యూలర్ జోన్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది...

48

ఫైనల్‌ ఫైట్‌లో ఇంగ్లాండ్ లేనప్పుడు ఇంత భారాన్ని భరించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇష్టపడడం లేదని, అందుకే లార్డ్స్ నుంచి ఫైనల్ మ్యాచ్‌ను వేరే వేదికకు తరలించాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్టు సమాచారం...

ఫైనల్‌ ఫైట్‌లో ఇంగ్లాండ్ లేనప్పుడు ఇంత భారాన్ని భరించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇష్టపడడం లేదని, అందుకే లార్డ్స్ నుంచి ఫైనల్ మ్యాచ్‌ను వేరే వేదికకు తరలించాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్టు సమాచారం...

58

‘త్వరలోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వేదికను ప్రకటిస్తాం. లార్డ్స్‌లోనే ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ అనుకోవడం లేదు. ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, వారి మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌తో చర్చించి, ఫైనల్‌ జరిగే వేదికను ఖరారు చేస్తాం...’ అంటూ ఐసీసీ అధికారి తెలిపారు...

‘త్వరలోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వేదికను ప్రకటిస్తాం. లార్డ్స్‌లోనే ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ అనుకోవడం లేదు. ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, వారి మెడికల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌తో చర్చించి, ఫైనల్‌ జరిగే వేదికను ఖరారు చేస్తాం...’ అంటూ ఐసీసీ అధికారి తెలిపారు...

68

గత ఏడాది ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్‌తో పాటు వెస్టిండీస్ జట్లు కూడా పర్యటించాయి. ఆ రెండు సిరీస్‌లు ముగించుకుని, శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి ఇండియాకు చేరుకుంది ఇంగ్లాండ్... ఇండియాలో ఎదురైన పరాభవం కారణంగా లార్డ్స్‌లో పూర్తి పేస్ పిచ్ తయారుచేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి...

గత ఏడాది ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్‌తో పాటు వెస్టిండీస్ జట్లు కూడా పర్యటించాయి. ఆ రెండు సిరీస్‌లు ముగించుకుని, శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి ఇండియాకు చేరుకుంది ఇంగ్లాండ్... ఇండియాలో ఎదురైన పరాభవం కారణంగా లార్డ్స్‌లో పూర్తి పేస్ పిచ్ తయారుచేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి...

78

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులు ఆడిన టీమిండియా, 12 విజయాలు, 4 పరాజయాలు, ఒక్క డ్రా చేసుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ కివీస్ ఆడింది 11 మ్యాచులే. అందులో ఏడింట్లో గెలిచి, నాలుగింట్లో ఓడింది. 

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులు ఆడిన టీమిండియా, 12 విజయాలు, 4 పరాజయాలు, ఒక్క డ్రా చేసుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ కివీస్ ఆడింది 11 మ్యాచులే. అందులో ఏడింట్లో గెలిచి, నాలుగింట్లో ఓడింది. 

88

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎక్కువ మ్యాచులు ఆడడం వల్ల విజయాల శాతం వాటిపై పడింది. పాయింట్ల ప్రకారం చూసుకుంటే 520 పాయింట్లతో ఉన్న టీమిండియాతో, 442 పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడేది...

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎక్కువ మ్యాచులు ఆడడం వల్ల విజయాల శాతం వాటిపై పడింది. పాయింట్ల ప్రకారం చూసుకుంటే 520 పాయింట్లతో ఉన్న టీమిండియాతో, 442 పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడేది...

click me!

Recommended Stories