వరల్డ్ కప్ జరుగుతున్నది మన దేశంలోనే... స్వదేశంలో టీమిండియాకు ఎదురులేదు. ఐపిఎల్ తో పాటు ప్రపంచ కప్ కు ముందు జరిగిన చాలా సీరిస్ లను స్వదేశంలోనే ఆడింది టీమిండియా. ఈ అనుభవమూ భారత్ కు కలిసివస్తుందని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ భావించారు. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాపార్డర్ తేలిపోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పుణ్యమా అని విజయం దక్కిందిగానీ లేదంటే టీమిండియా పరువు పోయే స్కోరు చూడాల్సి వచ్చేది. ఇలాగే ఆడితే భారత్ టైటిల్ రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.