ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ బలహీనంగా వున్నట్లు స్పష్టమయ్యింది. కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడుతోందని... వాళ్లు విఫలమైతే గెలుపుపై ఆశలు వదులకునే పరిస్థితి వుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ క్రీజులో నిలబడకుంటే టీమిండియా పరిస్థితి చాలా దారుణంగా వుండేది. అందువల్లే గిల్ లాంటి ఆటగాడు ఇప్పుడు భారత జట్టుకు చాలా అవసరం. అతడు జట్టులో చేరితే బ్యాటింగ్ విభాగం మరింత బలపడుతుంది... అప్పుడు అన్ని విభాగాల్లో టీమిండియా స్ట్రాంగ్ గా వుంటుంది.