కాగా ఈ సిరీస్ లో పంత్ నాయకుడిగా అత్తెసరు మార్కులతో పాస్ కాగా బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్ లో అతడు.. 1, 17, 6, 5, 29 (మొత్తంగా 58) పరుగులు చేశాడు. కానీ దాదాపు నాలుగేండ్ల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్..మెరుగైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో వచ్చే టీ20 ప్రపంచకప్ కు పంత్, కార్తీక్ లలో ఎవరిని ఎంపిక చేయాలని సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.