వర్షం ఆగిపోయాక తిరిగి ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ రెచ్చిపోయింది. లిటన్ దాస్ ను కెఎల్ రాహుల్ రనౌట్ చేశాక మ్యాచ్ గమనమే మారిపోయింది. అయితే దాస్ ఔటైనా.. షకిబ్, శాంతో, టస్కిన్ లు చివరివరకూ పోరాడారు. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లా 14 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్.. 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.